మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని మరోసారి రుజువు చేసింది సామజవరగమన: నిర్మాత రాజేష్ దండా

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో శ్రీవిష్ణు కథానాయకుడిగా, వివాహభోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. అనిల్ సుంకర సమర్పణలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తోన్న ఈ చిత్రం తాజాగా రూ.50కోట్ల మార్క్ ని దాటింది. రూ.50కోట్ల గ్రాస్‌ వసూళ్లు చేసి శ్రీ విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత రాజేష్ దండా విలేకరుల సమావేశంలో సామజవరగమన బ్లాక్ బస్టర్ విశేషాలని పంచుకున్నారు.

ముందుగా కంగ్రాట్స్.. ‘సామజవరగమన’ తో మంచి విజయాన్ని అందుకున్నారు..   సామజవరగమన’ వసూళ్లు చూస్తుంటే ఎలా అనిపిస్తోంది ?
థాంక్స్ అండీ. సామజవరగమన ఇంత పెద్ద విజయం సాధించి రూ.50కోట్ల క్లబ్ లోకి వెళ్ళడం ఆశ్చర్యపరిచింది. మంచి కంటెంట్ తో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయాన్ని అందుకుంటుందని మరోసారి రుజువు చేసిన సినిమా సామజవరగమన.  

సామజవరగమన సక్సెస్ కి ఎలాంటి అంశాలు సహకరించాయి ?
వినోదం, ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని చేసిన సినిమా ఇది. నువ్వు నాకు నచ్చావ్, గీత గోవిందం లాంటి స్క్రిప్ట్ అని నమ్మకం పెట్టుకున్నాం. మా నమ్మకం నిజమైయింది.

ఈ సినిమాని రీమేక్ చేసే అవకాశం ఉందా ?
అన్ని భాషల నుంచి రీమేక్ కోసం అడుగుతున్నారు. తమిళ్ లో మేమే ప్రొడక్షన్ చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.  

ఈ ప్రాజెక్ట్ ఎలా నచ్చింది ?
దర్శకుడు బౌండెడ్ స్క్రిప్ట్ తో 2020లో ఈ కథ చెప్పారు. చెప్పినప్పుడే చాలా నచ్చింది. అనిల్ గారికి  కూడా కథ వినిపించాను. ఆయనకీ నచ్చింది. అలా ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్య మూవీస్ బ్యానర్ రెండు కలసి ఈ సినిమా చేశాం. ఈ ప్రాజెక్ట్ లో అనిల్ గారు ఇచ్చిన ఇన్ పుట్స్ బాగా హెల్ప్ అయ్యాయి.

ఈ కథ మొదట శ్రీవిష్ణు గారితోనే అనుకున్నారా ?
వాస్తవానికి ఈ కథ సందీప్ కిషన్ గారితో చేయాలి. కానీ అప్పుడు ఆయన మైకేల్ తో బిజీగా వున్నారు. ఐతే మా దగ్గరికి పంపించింది సందీప్ గారే. ఈ విషయంలో క్రెడిట్ ఆయనికి దక్కుతుంది.  

థియేటర్ రన్ ఎలా వుంది ?
ఇది నాలుగో వారం. నాలుగో వారంలో కూడా థియేటర్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఫస్ట్ వీక్ కి సెకండ్ వీక్ థియేటర్స్ బాగా పెరిగాయి. ఒక చిన్న సినిమా ముఫ్ఫై రోజులు థియేటర్స్ లో ఆడటం చాలా పెద్ద విజయం. అలాగే యుఎస్ లో ఈ సినిమా 1 మిలియన్ సాధించింది. ఇది కలలో కూడా ఊహించలేదు. ఇది పెద్ద విజయం. చాలా ఆనందంగా వుంది. ఈ సినిమాకి ప్రిమియర్స్ చాలా హెల్ప్ అయ్యాయి.

సామజవరగమన ఇంతపెద్ద విజయం సాధిస్తుందని ముందే ఊహించారా ?
కథ విన్నప్పుడే చాలా నవ్వుకున్నాం. ఈ కథలో యూనిక్ పాయింట్ వుంది. శ్రీవిష్ణు, నరేష్ గారి ఫన్, సెకండ్ హాఫ్ లో వెన్నెల కిషోర్ పాత్ర .. ఇవన్నీ ప్రేక్షకులని అలరిస్తాయని అనుకున్నాం. మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షకులు వాటికి కనెక్ట్ అయ్యారు. సినిమా బావుంటుదని అనుకున్నాం. ఐతే ఈ స్థాయిలో నెంబర్స్ వస్తాయని మేమూ ఊహించలేదు. శ్రీవిష్ణు గారి మూడు సూపర్ హిట్ సినిమాలని కలిపితే ఈ ఒక్క సినిమాతోనే వచ్చింది.  

మీ మొదటి సినిమా మారేడుమిల్లి రిజల్ట్ తృప్తిని ఇచ్చిందా ?
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం చాలా నిజాయితీ గల సినిమా. కమర్షియల్ గా డబ్బులు తీసుకురాలేదు కానీ నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది.

స్క్రిప్ట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ?
కథ విన్నప్పుడు విజువల్ గా బావుటుందనిపించేది చేయడమే కానీ ఇలాంటిది చేయాలి, అలాంటిది చేయాలనే నిబంధనలు ఏమీ పెట్టుకోలేదు.

ఊరు పేరు భైరవకోన గురించి  ?
ఊరు పేరు భైరవకోన షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇందులో చాలా పెద్ద సీజీ వర్క్ వుంది. అది పూర్తయిన వెంటనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఇది హారర్ ఫాంటసీ జోనర్. మంచి యునిక్ కంటెంట్ వుంటుంది. ఎవరూ టచ్ చేయని ఒక పాయింట్ వుంది. తెలుగు, హిందీలో ఏకకాలంలో ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నాం.

ఇలాంటి విజయం తర్వాత పెద్ద సినిమాలు చేయాలని వుంటుంది..మీ ప్రణాళికలు ఎలా వున్నాయి?
ఖచ్చితంగా పెద్ద సినిమాలు చేయాలని వుంటుంది. నరేష్ గారు హీరోగా సోలో బ్రతుకు సో బెటరు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. అలాగే నవంబర్ నుంచి సందీప్ కిషన్ గారితో మరో సినిమా వుంటుంది.

Tfja Team

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

8 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago