కె.జి.యఫ్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రాక్ స్టార్ యష్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో నటించనున్నారు. ఆయన, నిర్మాత వెంకట్ కె.నారాయణ, కుటుంబ సభ్యులతో తో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయంను సందర్శించారు.
ఏదైనా కొత్త సినిమాను ప్రారంభించే ముందు ఇలా ఆలయాలను సందర్శించటం యష్కున్న అలవాటు అని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ నుంచి చక్కటి స్వాగతం లభించింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో ఆగస్ట్ 8 నుంచి ప్రారంభం కానుంది (8-8-8)
ఇలా 8-8-8 అనే నెంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం. నెంబర్ 8తో రాకింగ్ స్టార్ యష్కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టిన తేదితో ఈ తేది సరిపోతుంది. అలాంటి ఓ తేదీన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇటీవల కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్యూసర్లు, సెలబ్రిటీలు ఇంస్టాగ్రామ్ లోని సబ్ సెక్షన్ ఆప్షన్ ద్వారా 390 రూపాయలకి ఎక్స్క్లూజివ్…
తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరీంనగర్కు చెందిన ప్రముఖ ఎడిటర్ మధు రెడ్డి (Madhu Reddi) హైదరాబాద్లోని…
టాలీవుడ్లో మొట్టమొదటి వాలీబాల్ నేపథ్యంలోని స్పోర్ట్స్ డ్రామా ‘వాలీ’ (VOLLEY) తన టైటిల్ను ఆసక్తికరమైన మోషన్ పోస్టర్ ద్వారా అధికారికంగా…
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై చిరంజీవి (చెర్రీ) హేమలత…
మీడియా నేపథ్యంతో రూపొందుతున్న థ్రిల్లర్ చిత్రం “ది బ్రేకింగ్ న్యూస్” తాజాగా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ అనౌన్స్మెంట్తో ప్రేక్షకుల…