కె.జి.యఫ్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించిన హీరో రాక్ స్టార్ యష్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో నటించనున్నారు. ఆయన, నిర్మాత వెంకట్ కె.నారాయణ, కుటుంబ సభ్యులతో తో కలిసి కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలు శ్రీసదాశివ రుద్ర సూర్య ఆలయం, ధర్మస్థలలోని శ్రీ మంజునాథేశ్వర ఆలయం, సుబ్రమణ్యలోని కుక్కే సుబ్రమణ్య ఆలయంను సందర్శించారు.
ఏదైనా కొత్త సినిమాను ప్రారంభించే ముందు ఇలా ఆలయాలను సందర్శించటం యష్కున్న అలవాటు అని ఆయన అభిమానులు అంటున్నారు. ఆయనకు ఫ్యాన్స్ నుంచి చక్కటి స్వాగతం లభించింది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్ర షూటింగ్ బెంగళూరులో ఆగస్ట్ 8 నుంచి ప్రారంభం కానుంది (8-8-8)
ఇలా 8-8-8 అనే నెంబర్ వచ్చే రోజున యష్ తన కొత్త సినిమాను ప్రారంభించటం విశేషం. నెంబర్ 8తో రాకింగ్ స్టార్ యష్కు మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన పుట్టిన తేదితో ఈ తేది సరిపోతుంది. అలాంటి ఓ తేదీన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ చిత్రాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…
ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…
ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…
సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…