వరల్డ్ వైడ్ గా సిల్వర్ స్క్రీన్ పై సెన్సెషనల్ క్రియేట్ చేసి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ (The Face of the Faceless) మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ మద్దతుతో ఈ మూవీ నవంబర్ 21న తెలుగు వెర్షన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తెలుగు ఫిలింఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్బంగా ఒకప్పటి హీరో రాజా మాట్లాడుతూ.. ఒకప్పుడు నటుడుగా ఈ ఫిలిమ్ ఛాంబర్ కు వచ్చాను. ఇప్పుడు ఒక పాస్టర్ గా వచ్చాను. క్షమాపణ అనేది అందరి వల్ల అయ్యేది కాదు. క్షమాపణ అనేది గొప్పది. రాణి మారియా త్యాగం గురించి సినిమా ఉంటుంది. ఈ సినిమా ను ప్రతీ ఒక్కరూ ప్రమోట్ చేయాలి. 123 అవార్డులు పొందిన సినిమా ఇది. ఆస్కార్ కు కూడా ఎంట్రీ వచ్చిన సినిమా. నవంబర్ 21న విడుదలయ్యే ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు.
దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ సీఈఓ డాక్టర్ ఐ. లూర్దూ రాజ్ మాట్లాడుతూ.. “క్షమాపణ అనేది గొప్పది. ఒకరిని క్షమిస్తేనే శాంతి ఉంటుంది. చాగంటి ప్రొడక్షన్స్ సపోర్ట్ చేస్తుంది. ప్రపంచాన్ని కదిలించిన ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అందరు ఆదరించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ మాట్లాడుతూ..“గొంతుక లేని వారికి గొంతుక అందించే సినిమా ఇది. మన సమాజంలో ప్రేమ గురించి, శాంతి గురించి క్షమాపణ విలువను ఈ సినిమా తెలుపుతుంది. తెలుగు రాష్ట్రాలలో 50-60 థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సీమను ఆదరిద్దాం తెలుగులోను హిట్ చేద్దాం” అని అన్నారు.
CSI బిషప్ విల్సన్ మాట్లాడుతూ.. ”ప్రేమించడానికి ధైర్యం కావాలి. క్షమించడానికి ధైర్యం కావాలి. ఆస్కార్ కు నామినేట్ అయిన సినిమా ఇది. ప్రధాన పాత్ర అట్టడుగున ఉన్న వారికి సహాయపడే పాత్ర. హర్ట్ టచింగ్ స్టోరీ.” అని అన్నారు.
డైరెక్టర్ వంశీకృష్ణ మాట్లాడతూ.. “హరి హారన్, చిత్ర వంటి దిగ్గజలు ఈ సినిమాలో పాడారు. ఇలాంటి మానవత్వం కలిగిన ప్రపంచ స్థాయి సినిమాలను ప్రతీ ఒక్కరూ సపోర్ట్ చేద్దాం. ఇలాంటి సినిమాలు సమాజానికి ఎంతో అవసరం.” అని అన్నారు.
నటుడు జక్కుల కృష్ణ మోహన్ మాట్లాడుతూ… “ఈ సినిమాలో గుస్ బమ్స్ వచ్చే సీన్లు ఉన్నాయి. ప్రతీ ఒక్కరిని కదిలిస్తుంది. నవంబర్ 21న తెలుగు వెర్షన్ ను కూడా భారీ స్థాయిలో హిట్ చేద్దాం” అని అన్నారు.
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…