యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలై ఈ సినిమా ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో…’ అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేయసి ప్రేమలో మునిగిన ప్రేమికుడి మనసు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది.
సమర్థ్ గొల్లపూడి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను రెహ్మాన్ రాయగా.. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్కు కనెక్ట్ అయ్యేలా సాంగ్ కలర్ఫుల్గా ఉంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు:
రామ్ కార్తీక్, కశ్వి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్ (D.F Tech), సంగీత దర్శకుడు : సమర్థ్ గొల్లపూడి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణికందుకూరి (బియాండ్ మీడియా).
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…