యువ కథానాయకుడు రామ్ కార్తీక్, కశ్వి జంటగా రూపొందుతోన్న చిత్రం ‘వీక్షణం’. పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్పై మనోజ్ పల్లేటి దర్శకత్వంలో పి.పద్మనాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్గా విడుదలై ఈ సినిమా ఫస్ట్ లుక్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో…’ అనే లిరికల్ సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేయసి ప్రేమలో మునిగిన ప్రేమికుడి మనసు ఎలా ఉంటుందనే విషయాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది.
సమర్థ్ గొల్లపూడి సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను రెహ్మాన్ రాయగా.. ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించారు. యూత్కు కనెక్ట్ అయ్యేలా సాంగ్ కలర్ఫుల్గా ఉంది. ప్రస్తుతం సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన అప్డేట్స్ను అందిస్తామని మేకర్స్ తెలియజేశారు.
నటీనటులు:
రామ్ కార్తీక్, కశ్వి తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్ (D.F Tech), సంగీత దర్శకుడు : సమర్థ్ గొల్లపూడి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, పి.ఆర్.ఒ: నాయుడు సురేంద్ర కుమార్- ఫణికందుకూరి (బియాండ్ మీడియా).
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…