ఎఫ్ టీ పీ సి ఇండియా – తెలుగు సినిమా వేదిక సంయుక్త నిర్వహణ
కృష్ణంరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎఫ్ టీ పీ సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలు సినిమా, విద్య వైద్య సామాజిక రంగాలకు చెందిన పలువురిని రెబెల్ స్టార్ కృష్ణం రాజు ప్రతిభాపురస్కారం తో సత్కరించారు. సంస్థ అధ్యక్ష కార్యదర్సులు చైతన్య జంగా , విజయ్ వర్మ పాకలపాటి లు మాట్లాడుతూ విద్య వైద్య సామాజిక రంగాలను ప్రోత్సహించిన కృష్ణం రాజు గారి ఆశయాలు రాబోయే తరాలు గుర్తించుకొనేలా ఈ అవార్డు ల కార్యక్రమాన్ని ప్రతిఏటా నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నామని ఈ ఏడాది నిర్వహించిన కార్యక్రమం లో దుబాయ్ కి చెందిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు జితేంద్ర మైథలానే ని ప్రత్యేకంగా సత్కరించామని తెలిపారు. ప్రభుత్వ విప్ రామచంద్రులు నాయక్, ఘజల్ శ్రీనివాస్ , మాజీ ఎం ఎల్ సి ప్రభుత్వ చీఫ్ విప్ రుద్రరాజు పద్మరాజు , దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ , నటుడు గౌతమ్ రాజు, కృష్ణుడు, హెచ్ ఆర్ ఓ వరల్డ్ చైర్మన్ నేమ్సింగ్ ప్రేమి , తదితరులు విచ్చేసి పలురంగాల వారికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు.బాలీవుడ్ నటీమణులు ధని బోస్,మోక్ష , అనీషా ముఖర్జీ , నేహా షా లకు ప్రత్యేక పురస్కారాన్ని అందజేశారు.
భీమవరం లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్న కారణంగా హైదరాబాద్ లో జరిగే ఈ ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి రాలేకపోతున్నానని, ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న విజయ్ వర్మ , చైతన్యలకు తమ కుటుంభం తరుపున అభినందనలు తెలుపుతున్నట్లు స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి వీడియో విడుదల చేయడమే కాక కార్యక్రమం జరిగే సమయంలో ఫోన్ చేసి నిర్వాహకులను , అతిధులను , అవార్డు గ్రహీతలను అభినందించారు.
ఎఫ్ టీ పీ సి ఇండియా కు అమెరికన్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేషన్ రావడంపట్ల సంస్థ అధ్యక్ష కార్యదర్సులు హర్షం వ్యక్తం చేశారు.ఇండియా లోనే ఈ సర్టిఫికేషన్ వచ్చిన ఏకైక సంస్థ ఎఫ్ టీ పీ సి ఇండియా కావడం విశేషం .
హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లోని సురవరం ప్రతాపరెడ్డి హాల్ లో ఈకార్యక్రమం జరిగింది .
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…