తెలంగాణలో మారుమూల ప్రాంతంలో రజాకార్లపై నాటకాలు వేసిన కీ.శే. మురారిశెట్టి పుల్లయ్య సతీమణి, ప్రముఖ యువ దర్శకులు “బందూక్ లక్ష్మణ్ అలియాస్ బందూక్ బాబి”గా చిత్ర పరిశ్రమ / రాజకీయ వర్గాలకు సుపరిచితులు అయిన మురారిశెట్టి లక్ష్మణ్ మాతృమూర్తి మురారిశెట్టి రాములమ్మ 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
విప్లవ భావాలు కలిగిన లక్ష్మణ్ మురారి తండ్రి వారసత్వంగా వచ్చిన నటన , నాటకరంగాల వారసత్వంతో సినీ రంగానికి వచ్చి రెండు దశాబ్దాలుగా ప్రొడ్యూసర్ గా “ఏకవీర, వేటాడు వెంటాడు, 143 హైద్రాబాద్, ఇందు” లాంటి చిత్రాలను నిర్మించి, తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో బందూక్ చిత్రాన్ని దర్శకత్వం వహించి తన ప్రతిభను చాటుకున్నారు.
9మంది సంతానానికి జన్మనిచ్చిన శ్రీమతి రాములమ్మది 5 తరాలను చూసిన ఘనత. ఒకే కుటుంబం లో వందకు పైగా సభ్యుల బాగోగులు చూసుకున్న తన తల్లి కానరాని లోకాలకు వెళ్ళడం తమ కుటుంబానికి తీరని లోటని లక్ష్మణ్ పేర్కొన్నారు.నల్గొండ జిల్లాలో పిల్ పాల్ పహాడ్ గ్రామంలో 1930 దశకంలో పుట్టిన అయిదుగురు ఆడ సంతానంలో జన్మించిన రాములమ్మ 6, 7 ఏళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకొని రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర గల మంచాల గ్రామంలోనే జీవితం కొనసాగించింది,
గంపెడు సంతానం, పూట గడవని జీవితంలోనూ… కన్న పిల్లలకు విద్య, బుద్దులతోపాటు, సమాజం పట్ల బాధ్యతని నేర్పారు. అమ్మగా, అమ్మమ్మగా, మునిఅమ్మగా, ముని అమ్మమ్మగా 5 తరాలకు ప్రతీక గా నిలిచిన రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులతో పాటు, మంచాల గ్రామ పెద్దలు ఆకాంక్షించారు!!
‘ఉత్తుత్త హీరోలు’ సినిమాను ఎంవిఎం పిక్చర్స్ బ్యానర్ పై మహేష్ విట్టా నిర్మించారు . హాస్య నటనకు పేరుగాంచిన మహేష్…
రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’.…
తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న TFJA టీమ్ ను అభినందిస్తూ,…
సరికొత్త కంటెంట్ తో వ్యూయర్స్ ను ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ మరో సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్…
సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ "కపుల్ ఫ్రెండ్లీ" బాక్సాఫీస్ వద్ద స్టడీ…
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ )నూతన డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా 'మా…