హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలో కావ్య రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి రోకా వేడుక ఇరు కుటుంబాల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. రోకా వేడుక కావ్య రెడ్డి నివాసంలో ఘనంగా జరిగింది.

ఈ వేడుకలో దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, నిర్మాతలు శిరీష్, సాహు గారపాటి, రామ్ ఆచంట, మిర్యాల రవీందర్ రెడ్డి, నాగ వంశీ, కేకే రాధామోహన్, ధీరజ్ మొగిలినేని, హీరోయిన్ సంయుక్త తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు.


బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – కావ్య రెడ్డి నిశ్చితార్థం, వివాహ తేదీలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే ‘కిష్కింధపురి’ తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం ‘టైసన్ నాయుడు’, ‘హైందవ’ చిత్రాల్లో నటిస్తున్నారు.

