టాలీవుడ్

‘నిదురించు జహాపన’ మోషన్ పోస్టర్ లాంచ్

ప్రేమించుకుందాం రా , సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఆర్ ఎంటర్ టైన్మెంట్స్,  శ్రీజ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై  సామ్ జి, వంశీ కృష్ణ వర్మ ఓ యూనిక్ ఎంటర్ టైనర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘నిదురించు జహాపన’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని లాక్ చేసిన మేకర్స్ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేశారు.

మోషన్ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సముద్రతీరంలో హీరో మంచంపై నిద్రపొతుండగా.. ”చాలా ప్రశాంతంగా వున్న ఇతని జీవితంలోకి ఒక రోజు నిద్రముంచుకొచ్చింది నాయిన” అనే వాయిస్ వినిపిస్తూ..వచ్చింది నిదరే అయినా అది ప్రమాదకరం అనే అర్ధం వచ్చేట్లు డేంజర్ బోర్డ్ చూపించడం.. తర్వాత బుర్రకథ స్టైల్ లో వినిపించిన కొన్ని లైన్స్ చాలా క్యూరియాసిటీని పెంచాయి.  

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్  గా ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే.. చిత్రాలు చేశాను. ఇప్పుడు కథానాయకుడిగా ”నిదురించు జహాపన’ చేస్తున్నాను. మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా హార్డ్ వర్క్ చేశాం. ఇది గ్రేట్ జర్నీ. అనూప్ రూబెన్స్ గారు వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ప్రసన్న గారు చాలా అద్భుతమైన స్క్రిప్ట్ ఇచ్చారు. మీ అందరినీ తప్పకుండా అలరిస్తుంది. జీవితాంతం సినిమాల్లోనే వుంటాను. సినిమా నా ప్రాణం. మీ అందరినీ అలరించడానికి నా శక్తిమేర ప్రయత్నిస్తాను”అన్నారు

ప్రసన్న కుమార్ దేవరపల్లి మాట్లాడుతూ.. ఒక మనిషి నిద్రపోయిన తర్వాత కలలు వస్తాయి. ఐతే ఆ కల గురించి ఓ పది నిమషాలు చెప్పుకుంటాం. మిగతా సమయం అంతా ఏం జరుగుతుందనేది ఒక క్వశ్చన్ మార్క్. అలాగే ఈ  సినిమాలో మా హీరో ఆరు నెలలు కంటిన్యూస్ నిద్రపోతూనే వుంటాడు. అందుకే ఈ టైటిల్ పెట్టాం. దాదాపు సముద్ర నేపధ్యంలో సాగే కథ ఇది. ఈ ప్రయాణంలో చాలా సవాళ్ళు ఎదురుకున్నాం. మా నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. అందరం టీం వర్క్ గా ఈ సినిమా చేశాం.  ఆనంద్ వర్ధన్ డైరెక్టర్స్ హీరో. చాలా చక్కగా నటించారు. చిన్నప్పుడు తను బాలనటుడిగా చేసిన అనుభవం అంతా ఇందులో కనిపిస్తుంది. అనూప్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సినిమా తప్పకుండా మీ అందరినీ అలరిస్తుంది.” అన్నారు

అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ.. దర్శకుడు ప్రసన్న, హీరో ఆనంద్ వర్ధన్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రసన్న చాలా మంచి దర్శకుడు అవుతారు. కథ చాలా నచ్చింది. పాటలన్నీ బాగా వచ్చాయి. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఎంటర్ టైన్ చేస్తుంది” అన్నారు.

రోష్ని సాహోత మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. చాలా స్పెషల్ మూవీ ఇది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అన్నారు  

నవమి గయాక్ మాట్లాడుతూ ..ఈ సినిమా కోసం టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆనంద్ తో పాటు మిగతా యూనిట్ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను” అన్నారు.  

రామరాజు, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి  స్టార్ కంపోజర్ అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆనంద రెడ్డి నడకట్ల కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి వెంకట్, నానిబాబు కారుమంచి ఎడిటర్స్.

తారాగణం: ఆనంద్ వర్ధన్, నవమి గయాక్, రోష్ని సాహోతా, రామరాజు, పోసాని కృష్ణ మురళి, కల్పలత గార్లపాటి, కంచరపాలెం రాజు, వీరేన్ తంబిదొరై,  జబర్దస్త్ శాంతి కుమార్ తదితరులు

సాంకేతిక విభాగం
రచన, దర్శకత్వం:  ప్రసన్న కుమార్ దేవరపల్లి
నిర్మాతలు : సామ్, జి. వంశీ కృష్ణ వర్మ
సంగీతం : అనుప్ రూబెన్స్
డీవోపీ: ఆనంద రెడ్డి నడకట్ల  
ఎడిటర్ : వెంకట్, నానిబాబు కారుమంచి
లిరిక్స్ : కళ్యాణ్ చక్రవర్తి, శ్రేష్ట, ప్రసన్న కుమార్ దేవరపల్లి
ఆర్ట్ డైరెక్టర్: టాగోర్
యాక్షన్ : నందు
పీఆర్వో: వంశీ – శేఖర్

Tfja Team

Recent Posts

విశ్వం చిత్రంలో ప్రతీదీ చాలెంజ్ గా అనిపించింది – కావ్యథాపర్

గోపీచంద్, కావ్యథాపర్ జంటగా డైనమిక్ దర్శకుడు  శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,…

2 hours ago

అశోక్ గల్లా దేవకీ నందన వాసుదేవ నవంబర్ 14న విడుదల

ప్రశాంత్ వర్మ కథతో పెద్ద స్పాన్ వున్న దేవకీ నందన వాసుదేవ సినిమా చేయడం అధ్రుష్టంగా భావిస్తున్నా : అశోక్…

5 hours ago

“కిల్లర్” మూవీ మోషన్ గ్రాఫిక్ పోస్టర్ లాంఛ్

పలు సూపర్ హిట్ సీరియల్స్, సినిమాలు లో నటించి పాన్ ఇండియా వీక్షకుల ఆదరణ పొందడంతో పాటు సోషల్ మీడియాలో…

5 hours ago

Killer starring Jyothi Poorvaj, motion graphic poster launched

Jyothi Poorvaj, the heroine who has starred in numerous hit serials and films, has become…

5 hours ago

Manmadha is rushing with collections even in re-release

Manmadha, which was released in 2004 with Simbu and Jyotika as the hero and heroine,…

6 hours ago

రీ రిలీజ్ లో కూడా కలెక్షన్స్ తో దూసుకుపోతున్న శింబు మన్మధ

శింబు, జ్యోతిక హీరో హీరోయిన్లు గా 2004లో విడుదలైన మన్మధ 20 సంవత్సరాలు తర్వాత అక్టోబర్ 5న రీ రిలీజ్…

6 hours ago