▪️ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్బస్టర్ కావాలి
▪️ ఘనంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ని ప్రారంభోత్సవం
హైదరాబాద్ :
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్’ (Kolors Healthcare) బంజారా హిల్స్ బ్రాంచీలో సందడి చేసింది. ఈ సందర్భంగా ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ని ప్రారంభించింది. ఆధునిక టెక్నాలజీతో ఈ సంస్థ అందిస్తున్న సేవలను ఆమె స్వయంగా పరిశీలించింది.
అనంతరం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరికీ హెల్త్ కేర్ ఎంతో ముఖ్యమని, ఈ సేవలను ఎంతో నాణ్యంగా, ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న ‘కలర్స్’ సంస్థ నిర్వాహకులను ఆమె అభినందించింది. ప్రతి ఒక్కరూ అందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాము. అలాంటి సేవలను అందిస్తూ ఎంతో మందిని ఆరోగ్యపరంగా సంతృప్తి పరిచిన సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ అని కొనియాడారు. ”లైఫ్స్టైల్ బాగుండాలని కోరుకునే వారందరికీ ఈ సంస్థ మెరుగైన సేవలు అందిస్తూ ఇప్పుడు ఆధునిక సాంకేతికతను జోడించుకుని ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’గా ఎదగడం సంతోషం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ మాదిరిగానే ‘కలర్స్’ కూడా బ్లాక్బస్టర్ కావాలి” అని ఐశ్వర్య రాజేష్ ఆకాంక్షించారు.
‘కలర్స్ హెల్త్ కేర్’ సీవోవో శివాజీ కూన మాట్లాడుతూ.. 2004లో ప్రారంభించిన ‘కలర్స్ హెల్త్ కేర్’ సేవలకు మరింత అడ్వాన్స్ టెక్నాలజీని జోడిస్తూ ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పటికీ 50 బ్రాంచీలు ఉన్న తమ ‘కలర్స్ హెల్త్ కేర్’ను వచ్చే ఏడాది చివరి కల్లా దేశవ్యాప్తంగా 250 బ్రాంచీలకు విస్తరించనున్నట్లు ప్రకటించారు.
‘కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాయుడు మాట్లాడుతూ.. యూఎస్ – ఎఫ్డీఏ అఫ్రూవుడ్ టెక్నాలజీతో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించినట్టు తెలిపారు.
‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా అతిథులుగా పాల్గొన్న మినర్వా హోటల్స్ అధినేత, మాజీ ఎంపీ ప్రభాకర్ రెడ్డి, సీబీఐటీ డైరెక్టర్ దివ్యారెడ్డి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ…
అమరావతి, జనవరి 28 :- అలనాటి మేటినటి, నిర్మాత, కృష్ణవేణి జీవిత చరిత్రను ‘మీర్జాపురం రాణి-కృష్ణవేణి’ అనే పేరుతో సీనియర్…
తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
ఇటీవల లిటిల్హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్ఫుల్ ద్వయం…
నితిన్ హీరోగా వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై రూపొందనున్న యూనిక్ సైఫై ఎంటర్టైనర్.. వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో…