‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘కిడ’కు అవార్డు

ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కిడ’. ఇప్పుడు ఈ సినిమాకు అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరిగిన ఇఫీ (ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా)లోని పనోరమాలో చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా 20వ చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా ‘కిడ’కు పురస్కారాన్ని అందజేశారు. 

నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, దర్శకుడు ఆర్ఏ వెంకట్… అవార్డుతో పాటు రివార్డుగా ఇద్దరికీ చెరొక లక్ష రూపాయలను 20వ చెన్నై ఫిల్మ్ ఫెస్టివల్‌లో అందజేశారు. ఈ చిత్రంలో నటించిన పూ రాము ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు.

శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన సినిమా ‘కిడ’. ఆర్ఏ వెంకట్ దర్శకత్వం వహించారు. పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి ప్రధాన తారాగణం. ఓ తాత, మనవడు, మేక చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో ఓ అందమైన ప్రేమకథ కూడా ఉంది. దర్శకుడితో పాటు సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు… ఇలా చాలా మందికి తొలి చిత్రమిది.   

ఇరవై ఏళ్లుగా చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులు, దర్శక – నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులకు పురస్కారాలు అందిస్తున్నారు. పలు చిత్రాలు పోటీలో ఉన్నప్పటికీ ‘కిడ’లో కథ, కథనం, నటీనటుల ప్రతిభ, నిర్మాణ విలువలు మెచ్చిన ఫెస్టివల్ జ్యూరీ ‘ఉత్తమ చిత్రం’ అవార్డు అందించారు. 

అవార్డు వచ్చిన సందర్భంగా చిత్ర ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ ”గోవాలో ఈ ఏడాది జరిగిన ఇఫీలోని పనోరమాలో ‘కిడ’ను ప్రదర్శించారు. అప్పుడు స్టాండింగ్ ఒవేషన్ లభించింది. ఇప్పుడు సినిమాకు అంతకు మించిన ఆదరణ, గౌరవం పొందింది.  చెన్నై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రంగా పురస్కారం లభించింది.  నాకు, మా చిత్ర బృందానికి ఎంతో సంతోషంగా ఉంది. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు. 

పూ రాము, కాళీ వెంకట్, దీపన్, పాండియమ్మ, విజయ, కమలి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆడియోగ్రాఫర్: తపస్ నాయక్, ఆర్ట్ డైరెక్టర్ : కె.బి. నందు, లిరిసిస్ట్ : ఏకదేసి, ఎడిటర్ : ఆనంద్ గెర్లడిన్, సంగీతం : థీసన్, సినిమాటోగ్రఫీ : ఎం. జయప్రకాశ్, నిర్మాత : స్రవంతి రవికిశోర్, దర్శకత్వం: ఆర్ఏ వెంకట్.

TFJA

Recent Posts

యంగ్‌ టీమ్‌ ఎనర్జీతో రూపొందించిన ‘శ్రీ చిదంబరం గారు’ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నాను: లెజెండరీ మ్యూజిక్‌ డెరెక్టర్‌ ఎమ్‌.ఎమ్‌.కీరవాణి

శ్రీమతి. చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా…

11 hours ago

అంగరంగ వైభవంగా “సుమతీ శతకం” ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ – టికెట్ ధర కేవలం 100,150 మాత్రమే

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. సాయి సుధాకర్ కొమ్మాలపాటి…

11 hours ago

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ “కిల్లర్” నుంచి పవర్ ఫుల్ విలన్ మనీష్ గిలాడ క్యారెక్టర్ లుక్ రిలీజ్

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "కిల్లర్". మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్,…

11 hours ago

ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ “స్కై”

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

11 hours ago

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ‘నటకిరీటి’ రాజేంద్ర ప్రసాద్ భేటీ: ‘పద్మశ్రీ’ వచ్చినందుకు ఘన సత్కారం

ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

1 day ago