తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీఎఫ్జేఏ) కమిటీ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. చిత్రసీమకు, సినీ కార్మికులకు తెలంగాణ సీఎం అండగా నిలుస్తున్నందుకు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ 24 శాఖల అనుబంధ సంస్థల ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. అందులో టీఎఫ్జేఏ సభ్యులను ముఖ్యమంత్రికి పరిచయం చేశారు అధ్యక్షులు వైజే రాంబాబు.
జర్నలిస్టులకు టీఎఫ్జేఏ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో చేయాలని తలపెట్టిన కార్యక్రమాల గురించి వివరించడానికి సమయం ఇవ్వవలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని వైజే రాంబాబు కోరగా… తప్పకుండా మరొకసారి కలుద్దామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో టీఎఫ్జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ఉపాధ్యక్షులు ప్రేమ మాలిని, సంయుక్త కార్యదర్శి జీవీ రమణ – సురేష్ కొండి, ఇతర కమిటీ సభ్యులు ఉన్నారు.
ప్రముఖ సినీ నటులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు బుధవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై ఎన్ వీ వీ…
ప్రముఖ సినీ నటులు, ‘నటకిరీటి’ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మంగళవారం సాయంత్రం (03/02/2026) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ…
ఇటీవల తాను అతిధిగా పాల్గొన్న సినిమా ఫంక్షన్ లో జరిగిన దానికి బాధపడుతున్నానని తెలిపారు ప్రముఖ నటులు జె.డి.చక్రవర్తి. ఆయన…
సినిమా రంగాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే లక్ష్యంతో AVAA ఎంటర్టైన్మెంట్ ఆధ్వర్యంలో AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ అధికారికంగా…
లెజెండ్ శరవణన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "లీడర్". ఈ చిత్రాన్ని లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్…